ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

31, జులై 2009, శుక్రవారం

లడ్డు

లడ్డు:

లడ్డులు భారతదేశమంతా విరివిగా లభించే మిఠాయి. శనగ పిండిని చిన్నగా బూందీగా చేసి దానికి బెల్లపు పాకము గాని లేదా చక్కెర పాకము గాని చేర్చి గుండ్రటి ఆకారములో చేయబడు వాటిని లడ్డుగా పిలుస్తారు. బూందీని లడ్డూగా మార్చే ముందు వాటికి ఇంకా రుచి వచ్చేందుకు యాలక్కాయలు, కిస్మిస్[ఎండుద్రాక్షలు], జీడిపప్పు లాంటివి చేరుస్తారు.



కావలసిన పదార్ధాలు


  • శనగ పిండి - అరకిలో

  • చక్కెర - ఒక కిలో

  • నెయ్యి - ముప్పావు కిలో

  • జీడిపప్పు - 100 గ్రా.

  • ఎండుద్రాక్ష - 30 గ్రా.

  • ఏలకులు - 10 గ్రా.

  • పచ్చ కర్పూరం

  • కుంకుమ పువ్వు

  • మిఠాయి రంగు.

కావలసిన పరికరాలు

  • బూందీ చట్రాలు
  • బూరెల మూకుడు
  • రెండు వెడల్పాటి కళాయి గిన్నెలు

తయారుచేయు విధానం

  • శనగ పిండి ఒక కళాయి గిన్నెలో గరిటె జారుగా నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలిసేటట్టుగా కలపాలి.
  • చక్కెరలో ఒక లీటరు నీళ్ళుపోసి ఆ గిన్నెను పొయ్యిమీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈ పాకాన్ని వేళ్ళతో పట్టుకొని చేస్తే కొంచెం తీగరావాలి. దీనిని లేతపాకం అంటారు.
  • ఒక స్పూనులో పాలుపోసి, చిటికెడు మిఠాయిరంగు కలిపి, ఆ పాలు పాకంలో పోసి ఒక్కసారి తిప్పితే పాకానికి మిఠాయిరంగు వస్తుంది. తరువాత పాకం గిన్నెను దించి పక్కగా ఉంచుకోవాలి.
  • నెయ్యి బూరెలమూకుడులో పోసి మరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ పండ్లు వేసి, వేయించి తీసి ఒక పక్కగా పెట్టుకోవాలి.
  • శనగ పిండి ముద్దని ఒక కప్పుతోగాని, గరిటెతో గాని తీసుకొని సన్నని రంధ్రాలు గలిగి లోతుగా ఉన్న చట్రంలో పొయ్యాలి. దానినుండి చిన్న చిన్న బిందువులుగా పెనంలో పడతాయి. అలా పెనం నిండా పడిన తరవాత చట్రం ముద్దలో ఉంచాలి.
  • బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
  • బూందీ ఎరుపురంగుగా వేగకమునుపే, అనగా పసుపు పచ్చరంగులో ఉన్నప్పుడే మెరకగా ఉన్న రెండో చట్రంతో దేవి, పక్కనున్న పాకం గిన్నెలో వేయాలి; గరిటెతో కిందనుండి పైకి, పైనుండి కిందకి కలియబెట్టాలి.
  • శనగపిండి ముద్ద ఎక్కువగా ఉంటే ఇదే పద్ధతిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి.
  • బూందీ వెయ్యడం పూర్తయ్యాక వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ పండ్లు కూడా పాకంలో వెయ్యాలి.
  • తరువాత ఏలకుల పొడి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం కలపాలి.
  • చల్లారిన తర్వాత కావలసినంత పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ఉండకడుతున్నప్పుడు విడిపోతున్నట్లు తోసిన, అరచేత్తో నొక్కినట్లయితే విడిపోవు. ఉండల్ని గాలి తగిలేటట్లుగా పదినిమిషాలు ఉంచాలి.