ఈ బ్లాగ్ రూపకర్త జె.రామాంజనేయులు(MCA)

27, జులై 2009, సోమవారం

అధర్వణుడు:

అధర్వణుడు
అధర్వణుడు తొలి తరం తెలుగు కవి. ఇతడు నన్నయ యుగానికి లేదా తరువాతి యుగానికి (శివకవి యుగానికి) చెందినవాడు కావచ్చును.
అధర్వణుడు భారతమును ఆంధ్రీకరించెనని ఒక ప్రతీతి ఉంది. కాని అది ఇప్పుడు లభించడంలేదు. అధర్వుని భారతాన్ని అసూయతో నన్నయ తగులబెట్టించాడని ఒక పుక్కిటి పురాణ కధ ఉన్నది గాని "ఈ పాపపు కధ కల్పించిన వానికి వచ్చిన పుణ్యమెట్టిదో అతనికే యెరుక" అని పింగళి లక్ష్మీకాంతం వ్యాఖ్యానించాడు.[
సర్వ లక్షణ సార సంగ్రహము, కవి చింతామణి, అప్ప కవీయము వంటి లక్షణ గ్రంధాల రచయితలు అధర్వణుని భారతం నుండి కొన్ని పద్యాలు ఉదాహరించారు. ఆ పద్యాలను పరిశీలించిన వీరేశలింగం పంతులు అవి విరాటోద్యోగ భీష్మ పర్వాలకు చెందినవని తేల్చాడు. ఇతని రచన మిక్కిలి ప్రౌఢంగా ఉంది. తిక్కన లాగానే అధర్వణుడు కూడా నన్నయ శేష భారతాన్ని తెలిగించి ఉండవచ్చును కాని అది సంపూర్ణముగా నుండి విస్మరింపబడిందని విమర్శకుల ఊహ. "మ"గణం, "ర"గణం వినియోగం విధానాన్ని గురించి ఒక లక్షణ గ్రంధంలో ఉదాహరింపబడిన పద్యం ప్రకారం ఇతడు నన్నెచోడుని తరువాతివాడు కావచ్చును.